(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
రాజ్యసభ నుండి ఎనిమిది మంది సభ్యులను చైర్మన్ వెంకయ్యనాయుడు వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు.
వ్యవసాయ బిల్లులు ఆమోదం సందర్బంగా రాజ్యసభలో ఆదివారం చోటుచేసుకున్న గందరగోళ పరిస్థితులపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అసహనం వ్యక్తం చేశారు. నిబందనలను అనుసరించకుండా బిల్లులను ఆమోదించారని సభ్యులు ఆందోళన చేశారన్నారు. సభా నియమాలకు విరుద్దంగా డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సింగ్ పై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస నోటిసును వెంకయ్య నాయుడు తోసిపుచ్చారు. ఆదివారం జరిగిన సభలో సభ నియమాలకు విరుద్దంగా ప్రవర్తంచిన విపక్ష రాజ్యసభ సభ్యులపై చర్యలు తీసుకోవాలని అధికార బిజెపి పార్టీ చేసిన ఫిర్యాదు మేరకు ఎనిమిది మంది ఎంపీలపై సభా ఛైర్మన్ సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెన్షన్ కు గురైన వారిలో ఎలమరిన్ కరీం, కె కె రాగేశ్, నాజిర్ హుస్సేన్, డోలాసేన్, రిపున్ బోర, రాజుసత్వ, సంజయ్ సింగ్, డెరెక్ ఒబ్రెన్ లు ఉన్నారు.
సస్పెన్షన్కు గురైనా… సభను వీడని ఎంపీలు
కాగా ఎనిమిది సభ్యులను చైర్మన్ సస్పెండ్ చేసినా వారు సభ నుండి వెళ్ళకపోవడంతో డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సభను వాయిదా వేశారు.
Special Bureau