అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్ను సస్పెండ్ చేసిన కేసులో మార్చి 11వ తేదీలోపు విచారణకు హాజరుకావాలంటూ జగన్మోహన్ రెడ్డిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడంతో ఈసీ స్పందించింది. వ్యవస్థాపక అధ్యక్షుడినైన తనను బహిష్కరించే అధికారం ఎవరికీ లేదంటూ సీఈసీకి ఫిర్యాదు చేశారు శివకుమార్. ఆయన ఫిర్యాదుతో ఎన్నికల సంఘం జగన్కు నోటీసులు జారీ చేసింది.
శివకుమార్ను ఎందుకు బహిష్కరించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. కాగా, 2009లో శివకుమార్ వైసీపీని స్థాపించారు. ఆ తర్వాత పార్టీని జగన్మోహన్ రెడ్డికి అప్పగించారు. అప్పటి నుంచి జగన్ అధ్యక్షుడిగా, విజయమ్మ గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.
శివకుమార్ కూడా పార్టీలో క్రియాశీలకంగానే వ్యవహరించారు. అయితే, ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో శివకుమార్ టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. దీంతో ఆగ్రహించిన పార్టీ అధిష్టానం.. శివకుమార్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.