NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజ‌కీయాలు

AP Elections: ఏపిలో మళ్లీ ఎన్నికల సందడి..! కసిగా టీడీపీ – విశ్వాసంతో వైసీపీ..!!

AP Elections: ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల సందడి ముగిసి దాదాపు రెండు నెలలు కావస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలు, ఒక నగర పాలక సంస్థకు ఎన్నికలు జరిగితే రెండు మున్సిపాలిటీలు మినహా మిగిలిన అన్నీ స్థానాల్లో వైసీపీనే గెలిచింది. కొండపల్లి, దర్శి తప్ప మిలిగిన అన్ని మున్సిపాలిటీలను వైసీపీనే కైవశం చేసుకుంది. నెల్లూరు నగర పాలక సంస్థను క్లీన్ స్వీప్ చేసింది. ఆ జోష్ లో వైసీపీ ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా 2021 మార్చిలో జరిగిన మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే నవంబర్ నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గట్టి పోటీనే ఇచ్చాము, ఓటింగ్ శాతం పెరిగింది అన్న సంతృప్తి టీడీపీలో ఉంది. అయితే టీడీపీ సంతృప్తికి, వైసీపీ జోష్ కు పరీక్ష పెట్టడానికి మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి ఏ ఎన్నికలు జరిగినా రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకమే.

AP Elections: ఆ 22 ఇవేనా..!?

2021 పంచాయతీ ఎన్నికల కంటే ఆ తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు పోటాపోటీగా జరిగాయి. ఆ తరువాత మున్సిపల్ ఎన్నికలు మరింత టఫ్ గా జరిగాయి. నవంబర్ నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ పోరు జరిగింది. మళ్లీ ఇప్పుడు మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ నెల మొదటిలో 22 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో శ్రీకాకుళం, రాజమండ్రి, మంగళగిరి – తాడేపల్లి కార్పోరేషన్ లు ఉండగా.. పామిడి, శ్రీకాళహస్తి, గూడూరు, నరసరావుపేట, పొన్నూరు, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తాడిగడప, పాలకొల్లు, రాజాం, ఆముదాలవలస, గుడివాడ, బాపట్ల, కావలి, కందుకూరు, పొదిలి, భీమవరం, చింతలపూడి, ఆలూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నట్టు తెలుస్తుంది. రీసెంట్ గా జరిగిన టీడీపీ రివ్యూ మీటింగ్ లో చంద్రబాబు స్పష్టంగా పార్టీ శ్రేణులకు చెప్పేశారు. 22 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయనీ, వీటిలో తెగించి పార్టీ శ్రేణులు పోరాడాలాని పిలుపు నిచ్చారు. ఈ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డి టీడీపీ బలం చూపించాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. అధికార పార్టీ ఎన్ని రకాల దౌర్జన్యాయాలు చేసినా తెగించి నిలబడాలని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు.

TDP Strategy Failure: Babu Big Mistake in this..!?

పాపం టీడీపీ.. స్పీడ్ గా వైసీపీ..!!

ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. కానీ ఇప్పుడు టీడీపీ పరిస్థితి కాస్త మెరుగయింది. పోరాడడానికి కార్యకర్తలు, నాయకులు ముందుకొస్తున్నారు. అయితే వైసీపీ వ్యూహాలు ముందు టీడీపీ ఏ మాత్రం నిలువనుంది అనేది తేలాల్సి ఉంది.
* గతంలో జరిగిన కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ ఏ విధంగా ఓడిపోయింది..? అనేది అందరికీ తెలిసిందే. కుప్పంలో టీడీపీ పరాజయం పాలవ్వనుందని “న్యూస్ ఆర్బిట్” ముందుగానే పరిశోధనాత్మక కథనం ప్రచురించింది. కుప్పంలో అమలు చేసిన స్ట్రాటజీని వైసీపీ.. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో అమలు చేయదు అన్న గ్యారెంటీ ఏమి లేదు. జరగబోయే ఎన్నికల్లోనూ ప్రతిపక్షాన్ని దెబ్బతీసేందుకు అధికార వైసీపీ వారి వ్యూహాలతో ముందుకు సాగనుంది. ప్రత్యర్ధి ఎలాంటి వ్యూహాలతో వస్తారని తెలిసి కూడా జాగ్రత్త పడకపోవడం టీడీపీ బలహీనత. ప్రత్యర్ధి ఎత్తుగడలను అడ్డుకోలేకపోవడం టీడీపీ బలహీనతగా మారింది. కుప్పంలో ఎలా జరుగుతుందో తెలిసి తెలిసి టీడీపీ ఓడిపోయింది. పెనుగొండ లాంటి ఏరియాలో బలం ఉన్నప్పటికీ ఓడిపోయారు. ఇలా టీడీపీ చతికిలపడింది. అందుకే చంద్రబాబు రివ్యూలో స్పష్టం చెప్పారు. పార్టీ శ్రేణులు త్యగించండి, కేసులు ఎదుర్కోండి, ఎలాగైనా సరే పార్టీ పరువు, పార్టీ బలం నిరూపించాలని చాలా సీరియస్ గా చెప్పారట. మరో పక్క ప్రతి వారం రెండు మూడు మున్సిపాలటీలకు సంబంధించి రిపోర్టులు తెచ్చుకుని రివ్యూ చేయడంతో పాటు దిశానిర్దేశం చేస్తానని చంద్రబాబు సూచించినట్లు సమాచారం. అటు వైసీపీ కూడా 22 మున్సిపాలిటీలకు 22 కైవశం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. మొన్న జరిగిన వాటిలో కొండపల్లి, దర్శిలో ఓడిపోయాము ఈ సారి ఏది ఓడిపోవడానికి వీలులేదని మొత్తం గెలవాలన్న ప్లాన్ లో వైసీపీ ఉంది. జగన్ కూడా అంతర్గతంగా ఈ సారి ఒక్క మున్సిపాలిటీ కూడా ఓడిపోవడానికి వీల్లేదని.., ఒకవేళ ఓడితే మాత్రం వచ్చే ఎన్నికల్లో సీట్లపై ప్రభావం పడుతుందని పరోక్షంగా హెచ్చరించేసారు..!

author avatar
Srinivas Manem

Related posts

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Fire Accident: అనంతపురం గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం ..రూ.2కోట్లకుపైగా ఆస్తినష్టం..!

sharma somaraju

Vote: ఓటర్లకు బిగ్ అలర్ట్ .. ఓటు హక్కు నమోదునకు నేడే అఖరు రోజు

sharma somaraju

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju

ఇలా చేస్తే త‌ప్పా కూట‌మి స‌క్సెస్ కాదా… ఇదే ఆఖరి అస్త్రం..!

ఏడ్చి సీటు కొట్టేసిన టీడీపీ లీడ‌ర్ విక్ట‌రీ ప‌క్కా… భారీ మెజార్టీ కూడా..?

మంగ‌ళ‌గిరిలో గెలుపు కోసం లోకేష్ చివ‌ర‌కు ఈ ప్ర‌చారం కూడా చేస్తున్నాడే…!