టిడిపి పార్టీ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా పోయిన పరిస్థితి నెలకొనగా ఏపీలో కూడా ఇదే రిపీట్ అవుతున్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి వార్తలు వస్తున్నాయి. కేవలం 23 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు కి ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ గోడ దూకటం తో ఉన్న ప్రతిపక్ష పదవి కోల్పోయే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది.
ఇదిలా ఉండగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ కీలకమైన నియోజకవర్గంలో దాదాపు రెండు సార్లు టిడిపి పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు పార్టీకి నియోజకవర్గానికి చాలా దూరంగా ఉంటున్నారట. కనీసం క్యాడర్ ని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు అన్నట్టు పశ్చిమగోదావరి టిడిపి జిల్లా రాజకీయాల వార్తలు వస్తున్నాయి. గతంలో నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న గత సార్వత్రిక ఎన్నికలలో తన ఓటమికి కారణం చంద్రబాబే అని ఆ కీలక నేత భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇటీవల పార్టీలో అనేక మంది ఫోన్లు చేసినా స్పందించకుండా కార్యకర్తలకు అందుబాటులో లేకుండా ఉంటున్నారట.
చంద్రబాబు హయాంలో గతంలో పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాలనే శాసించిన ఈ నేత ధోరణి టిడిపి పార్టీ హైకమాండ్ కి తీవ్రస్థాయిలో వ్యతిరేకంగా మారటంతో చంద్రబాబు లో టెన్షన్ మొదలైనట్లు….బుజ్జగింపులు స్టార్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కచ్చితంగా ఈ నాయకుడు టిడిపిని వీడితే పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు టిడిపికి ఇది చావు దెబ్బ లాంటిది అని విశ్లేషకులు అంటున్నారు.