డిసెంబర్ ఇరవై అయిదు క్రిస్మస్ నాటికి రాష్ట్రం క్లీన్ అవుతుందని చెద పురుగులు వదిలి పోతాయని ఆ తర్వాత సంక్రాంతి సంబరాలు సరదాగా చేసుకుందామని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఈ మధ్య కాలంలో తరచూ ఏదో ఒక సంచలన ప్రకటనతో మీడియా ముందుకొస్తున్న రఘురామకృష్ణంరాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇవి.ఆంధ్రప్రదేశ్లో న్యాయానికి సంకెళ్లు వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.అలాంటి చెదపురుగులను సమూలంగా నాశనం చేసే శక్తి న్యాయస్థానాలకు ఉందన్నారు.ఆ చెద పురుగులు ఎవరో అందరికీ తెలుసునని ఆ చెద వదిలే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.వారేమయి పోతారో క్రిస్మస్ నాటికి తేలిపోతుందని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.కాగా తనను అరెస్టు చేయించేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారని అని అయన చెప్పారు.ఇందుకోసం ఒక షెడ్యూల్ క్యాస్ట్ అధికారిని కూడా సిద్ధం చేశారన్నారు.
తాను నియోజకవర్గానికి వెళ్లగానే ఆ షెడ్యూల్ క్యాస్ట్ అధికారిని తాను ఏదో అన్నట్టు కేసు బిల్డప్ చేసి తనను అరెస్టు చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తాను ఆ అధికారిని ఏమనేది కూడా ముందే రాసిపెట్టి పైనుంచి వచ్చేసింది అన్నారు.ఇవన్నీ తెలిసే తాను ఆరు నెలల నుంచి అంతఃపురం నుండి బయటకు రాకుండా రికార్డెడ్ ప్రెస్మీట్లు పెట్టి కాలక్షేపం చేస్తున్నానన్నారు.తాజాగా తాను నియోజకవర్గం లో కనిపించడం లేదంటూ వైసిపి సోషల్ మీడియాలో ప్రచారం మొదలెట్టారని,తాను సంక్రాంతి పండుగకు కోడి పందాలకు మాత్రమే వస్తానంటూ దుష్పచారం చేస్తున్నారని ఆయన తెలిపారు.
ఇదంతా హైలెవల్లో ఓ పెద్దమనిషి సారధ్యంలో జరుగుతున్న వ్యవహారం అన్నారు.అయితే వారి ఆటలు సాగవని తనకు సెక్యూరిటీ తొలగించాలని చూసినా సాధ్యపడలేదని అనర్హత వేటు వేయించాలని అందరి కాళ్లు పట్టుకున్నా అది జరగలేదని రఘురామకృష్ణంరాజు చెప్పారు.ఉడత వూపులకు తను బెదిరే రకం కాదని ఎప్పుడు ఏం చేయాలో తనకు తెలుసునని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రచ్చబండలో మరిన్ని ముచ్చట్లు చెబుతానని రఘురామకృష్ణంరాజు ముగించారు
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?