TRS Party Plenary 2022: TRS పార్టీ 21వ వార్షికోత్సవానికి గ్రేటర్ హైదరాబాద్ లో వేదిక సర్వం సిద్ధం అయింది. పార్టీ ఆవిర్భవించి ఇరవై ఒక్క వసంతాలు పూర్తి కావడంతో ఈ నెల 27వ తారీకు హైదరాబాద్ మాదాపూర్ లో HICC లో ప్లీనరీ కోసం పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో మహా నగరం మొత్తం గులాబీ మయంగా మారింది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ రంజిత్ రెడ్డి,మరి కొంతమంది నాయకులు ఏర్పాట్లూ దగ్గరుండి చూసుకుంటున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుండి వచ్చే టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు కడుపునిండా రుచికరమైన వంటకాలు తయారు చేస్తున్నారు. దాదాపు ముప్పై మూడు రకాల వెరైటీ వంటకాలతో గుమ్మ గుమ్మ లాడించే ఐటమ్స్ సిద్ధం చేస్తున్నారు. కాజుఫ్రై, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, ములక్కాడ, కాజు, టమాట కర్రీ,వెల్లిపాయ కారం, టమాట, కొత్తిమీర తొక్కు, మామిడికాయ తొక్కు, పప్పుచారు అప్పడం, పచ్చిపులుసు, ఉలువ చారు క్రీమ్, టమాట రసం, పెరుగు, బటర్స్కాచ్ ఐస్క్రీమ్, ఫ్రూట్స్ స్టాల్, అంబలి, బటర్ మిల్క్, డబుల్కామీట, గులాబ్జామ్, మిర్చిబజ్జీ, రుమాలీ రోటీ, తెలంగాణ నాటు కోడి కూర, చికెన్ధమ్ బిర్యానీ, ధమ్కా చికెన్,మిర్చి గసాలు, ఆనియన్ రైతా, మటన్కర్రీ, తలకాయ కూర, బోటీదాల్చా, కోడిగుడ్డు పులుసు, బగారా రైస్, మిక్స్డ్ వెజ్ కుర్మా వైట్ రైస్, మామిడికాయ పప్పు, దొండకాయ.. వంటకాలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక ఇదే సమావేశంలో 2023 ఎన్నికలకు సంబంధించి పార్టీ తరఫున 11 తీర్మానాలు అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో మూడు రాజకీయ తీర్మానాలున్నట్లు పార్టీలో టాక్ నడుస్తుంది. అంతమాత్రమే కాకుండా జాతీయంగా టిఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో పోషించే పాత్ర… ఇంకా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు తదితర అంశాలపై తీర్మానాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రెండుసార్లు గెలిచిన టిఆర్ఎస్ పార్టీ వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో మూడోసారి గెలుపే లక్ష్యంగా ప్లీనరీ సమావేశంలో సరికొత్త నిర్ణయాలు ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈప్లీనరీ సమావేశానికి రాష్ట్ర మంత్రివర్గం మరియు టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో పాటు మొత్తంగా మూడు వేల మందికి పార్టీ అధిష్టానం ఆహ్వానం పంపడం జరిగింది. ఈ సమావేశానికి పురుషులు గులాబీ రంగులో చోక్కలతో పాటు స్త్రీలు గులాబిరంగు చీరలతో హాజరుకావాలని పార్టీ పేర్కొంది. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా..ప్లీనరీ సమావేశం విజయవంతం చేయాలని టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.