(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కర్నూలు: ఏపి రాజధాని మారిస్తే గ్రేటర్ రాయలసీమ ఇవ్వాలనీ లేకుంటే గ్రేటర్ రాయలసీమ ఉద్యమం ప్రారంభిస్తామనీ కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం వెల్లడించిన తరువాత ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. రాజధానిపై ప్రజలను జగన్ తప్పుదోవ పట్టిస్తున్నారని మరో నేత కెఇ ప్రభాకర్ విమర్శించారు.
రాజధాని మార్చాల్సి వస్తే కర్నూలులోనే రాజధాని ఏర్పాటు చేయాలని గ్రేటర్ రాయలసీమ నేత, మాజీ మంత్రి మైసూరారెడ్డితో సహా పలువురు నేతలు ఇప్పటికే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.