అనంతపురం, జనవరి 26: అనంతరం జిల్లా కదిరి సిఐగా పని చేసిన గోరంట్ల మాధవ్ శనివారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు. సిఐగా పని చేస్తున్న సమయంలో పోలీస్ అధికారుల సంఘ నాయకుడిగా అధికార పార్టీ ఎంపి జెసి దివాకరరెడ్డిపైనే మీసం మెలేసి ఛాలెంజ్ చేశాడు. దీంతో ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అనంతర పరిణామాల నేపథ్యంలో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
ఇటీవల అనంతపురం జిల్లా కురబ సమ్మేళనంలో మాధవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో కురుబలు, వివిధ పార్టీల నేతలతో పాటు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా హజరైయారు.
మాధవ్ నేడు తన సన్నిహితులతో హైదరాబాదులో వైఎస్ జగన్ సమక్షంలో వైసిపిలో చేరారు.