విశాఖపట్నం: వికేంద్రీకరణ అంటే ప్రాంతాలను విడగొట్టడం కాదని టిడిపి నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎవరైనా అభివృద్ధి చెందిన దేశాలను ఆదర్శంగా తీసుకుంటారు గానీ వెనుకబడిన దేశమైన దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలనుకోవడం హస్యాస్పదంగా ఉందని అయ్యన్న అన్నారు.
విశాఖ పరిపాలనా నగరం అవ్వవచ్చని సిఎం జగన్ అనడంతో ఉత్తరాంధ్రకు చెందిన పలువురు టిడిపి నేతలు సైతం వారి పార్టీ వైఖరికి భిన్నంగా జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అయితే అదే ప్రాంతానికి చెందిన అయ్యన్నపాత్రుడు మాత్రం పార్టీ వైఖరికి అనుగుణంగానే జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు.