అమరావతి: ఏపి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని టిడిపి నేత, హోమ్ శాఖ మాజీ మంత్రి నిమ్మకాయ చినరాజప్ప అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని విమర్శించారు.
రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేయడమే లక్ష్యంగా జగన్ పాలన నడుస్తోందని మండిపడ్డారు. 11 కేసుల్లో నిందితులుగా ఉన్న జగన్, విజయసాయి రెడ్డి..రాష్ట్రాన్ని అమ్మేస్తారని దుయ్యబట్టారు.కక్ష సాధింపుతో ప్రతిపక్ష పార్టీ నేతల ఆస్తులపై దాడులు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఆర్ధిక మూలాలపై దెబ్బతీస్తూ వైసిపి వైపు తిప్పుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?