(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడుగా సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాధ్ నియమితులైయ్యారు. అదే విధంగా కార్యనిర్వహక అధ్యక్షుడుగా సీనియర్ నేత తులసిరెడ్డి, మస్తాన్ వలీను పార్టీ అధిష్టానం నియమించింది.
2019 సార్వత్రిక ఎన్నికల తరువాత అధ్యక్ష పదవికి రఘువీరారెడ్డి రాజీనామా చేశారు. గత కొంత కాలంగా ఆయన పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నియామకం కోసం కొద్ది రోజుల క్రితం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఉమెన్ చాందీ రాష్ట్రంలోని ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?