(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకటి రెండు సినిమాల్లో నటిస్తే రాష్ట్రానికి వచ్చిన నష్టమేమీ లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. జనసేన పార్టీకి సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ రాజీనామా చేస్తూ చూపిన కారణంపై సోమిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఎన్టి రామారావు, ఎంజి రామచంద్రన్ లాంటి వాళ్లే రాజకీయాల్లోకి వచ్చాక కూడా కొన్ని సినిమాల్లో నటించడం చూశామన్నారు. పవన్ కళ్యాణ్ ఒకటి, రెండు సినిమాల్లో నటిస్తే రాష్ట్రానికొచ్చిన నష్టమేం లేదు కానీ…రాజకీయ నాయకులు నిజ జీవితంలో నటిస్తేనే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.
లక్ష్మీ నారాయణ (@VVL_Official) గారూ..ఎన్టీఆర్,ఎంజీఆర్ లాంటి వాళ్లే రాజకీయాల్లోకి వచ్చాక కూడా కొన్ని సినిమాల్లో నటించడం చూశాం. @PawanKalyan ఒకటి, రెండు సినిమాల్లో నటిస్తే రాష్ట్రానికొచ్చిన నష్టమేం లేదు కానీ… రాజకీయ నాయకులు నిజజీవితంలో నటిస్తేనే ప్రజాస్వామ్యానికి ప్రమాదం..
— Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) January 31, 2020