అమరావతి: చంద్రబాబు విదేశీ పర్యటనలపై వైసిపి సభ్యుల విమర్శలను మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఖండించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఖర్చులు అన్నీ దుబారాగా భావించడం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రులు ప్రత్యేక విమానాల్లో తిరగడం సహజంగా జరిగేదేననీ, దాన్ని అంత ఆశ్చర్యంగా చూడాల్సిన అవసరం లేదని యనమల అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రత్యేక విమానాల్లో తిరిగారనీ, జగన్ పదవీ ప్రమాణ స్వీకారం చేయకుండానే ప్రత్యేక విమానాల్లో తిరగలేదా అని యనమల ప్రశ్నించారు. చంద్రబాబు విదేశీ పర్యటనల వల్లే ఐదు లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయని యనమల పేర్కొన్నారు. గోదావరి జలాల తరలింపు విషయంపై మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఒక ప్రమాదకరమైన పథకంలో భాగస్వామి అవుతోందని హెచ్చరించారు. తెలంగాణ భూభాగం నుండి గోదావరి జలాల తరలింపును అంత తేలికగా చూడటం సరికాదని యనమల అన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన ప్రయత్నమనీ, భవిష్యత్తులో తెలంగాణ దయాదాక్షిణ్యాలపై నీటి విడుదల ఆధారపడి ఉంటుందని యనమల హెచ్చరించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?