విజయనగరం, జనవరి 9: విజయనగరం జిల్లా పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే యర్రా అన్నపూర్ణమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అన్నపూర్ణమ్మను కుటుంబ సభ్యులు విశాఖలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ బుధవారం అన్నపూర్ణమ్మ మృతి చెందారు.
అన్నపూర్ణమ్మ మృతి పట్ల మంత్రులు సుజయ కృష్ణ రంగారావు, గంటా శ్రీనివాసరావు, సిహెచ్ అయ్యన్నపాత్రుడు, కె అచ్చంనాయుడు సంతాపం ప్రకటించారు.