అమరావతి, జనవరి 18: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పార్లమెంట్ మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సమావేశమయ్యారు. శుక్రవారం ముఖ్యమంత్రి నివాసంలో లగడపాటి భేటీ అయ్యారు.
ఓ శుభకార్యానికి ఆహ్వానించేందుకు వచ్చినట్లు రాజగోపాల్ తెలిపారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని ఆయన చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్పై ఇప్పుడేమీ మాట్లాడనని ఆయన అన్నారు. రాజకీయాలు మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదని ఆయన చెప్పారు.
next post