గుంటూరు: సిఎం జగన్మోహనరెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల ప్రకటనపై మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు స్పందించారు. మూడు రాజధానుల ప్రకటన సరైంది కాదని అన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని డిమాండ్ చేశారు. అమరావతి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన రాజధాని అనడం అవివేకమని వ్యాఖ్యానించారు. గత మూడు దశాబ్దాలుగా తాడికొండ ఎస్సి రిజర్వుడ్ నియోజకవర్గమని ఆయన అన్నారు. విశాఖలో ఇన్సైడర్ ట్రేడింగ్ చేసేందుకే రాజధాని తరలించాలని ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మూడు రాజధానుల వల్ల అభివృద్ధికి ఆటంకం అవుతుందన్నారు. అభివృద్ధి జరగాలంటే పరిశ్రమలు స్థాపించాలన్నారు. డబ్బులు ఉన్న వారు అమరావతిలో భూములు కొనుక్కుంటే తప్పేముందని రాయపాటి ప్రశ్నించారు. ఇప్పడు విశాఖలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతోందని ఆయన ఆరోపించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?