అమరావతి: రాజధానిపై స్పష్టత వచ్చే వరకు వంద రోజులైనా రైతులు ఉద్యమాన్ని ఆపేలా లేరని మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు అన్నారు. నేడు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజధాని ఎక్కడికీ పోదని.. వెలగపూడిలోనే ఉంటుందని అశాభావం వ్యక్తం చేశారు. రాజధానిని తరలించవద్దు అని జేఏసీ ఆధ్వర్యంలో రేపు ప్రధానమంత్రి మోదీని రైతులు కలవనున్నారని ఆయన తెలిపారు.