అమరావతి, జనవరి 25: రాష్ట్ర విభజన తీరుపై ఈనెల 29న విజయవాడలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పార్లమెంట్ మాజీ సభ్యలు ఉండవల్లి అరుణ్కుమార్ తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించి అన్ని పార్టీల అధ్యక్షులకు లేఖలు రాసినట్లు ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణ కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
పార్లమెంట్, అసెంబ్లీల గడువు ముగుస్తున్నా, అన్యాయంగా జరిగిన రాష్ట్ర విభజన తీరును ఎంపీలు పార్లమెంట్లో ప్రస్తావించలేదని ఆయన అన్నారు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ న్యాయపరంగా ఉన్న అంశాల గురించి సమావేశంలో తెలియజేస్తారని ఆయన పేర్కొన్నారు. రాజకీయ పరమైన అంశాలను అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.