అమరావతి: టిడిపికి మద్దతుగా జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
ఈ నెల 26 , 27 న ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. 26 న నంద్యాల, కర్నూలులో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. 27 ఎమ్మిగనూరులో రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం భహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
చంద్రబాబుతో పాటు ఫరూఖ్ అబ్దుల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కర్నూలు జిల్లాలో ముస్లిం ఓటర్లు ఆదిత్యధికంగా ఉండటం వల్ల ఈ ఓటర్లను ఆకట్టుకునేందుకు చంద్రబాబు ఫరూఖ్ అబ్దుల్లాను ఇక్కడ ప్రచారానికి ఆహ్వానిస్తున్నట్టు భావిస్తున్నారు.
జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటు దిశగా అడుగులు వేసున్న చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు ఫరూఖ్ అబ్దుల్లాతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఆది నుంచి ఫరూఖ్ అబ్దుల్లా చంద్రబాబుకు మద్దతు తెలుపుతూనే ఉన్నారు.