Breaking News: కరోనా వైరస్ మాత్రమేకాక రకరకాల వేరియంట్లు పుట్టుకొస్తూ ఉండటంతో ప్రపంచంలో అనేక దేశాలు విలవిలలాడుతున్నాయి. ప్రస్తుత ప్రపంచంలో కరోనా వైరస్ వేరియంట్లలో డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరంగా పొంచి 85 దేశాలకు పాకి.. అనేక మందిని బలిగొన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
కేవలం కొద్ది రెండు వారాల్లోనే 11 దేశాల్లో బయటపడిన ఈ ప్రమాదకరమైన వ్యాధి.. తాజాగా.. ఏపీలో తిరుపతి లో బయటపడటంతో… ప్రమాద ఘంటికలు ఒక్కసారిగా మోగాయి. డెల్టా ప్లస్ వేరియంట్ కావటంతో రాష్ట్ర వైద్య శాఖ అప్రమత్తమైంది. స్వయంగా ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఏపీలో డెల్టా ప్లస్ కేసు నమోదు కావడంతో ప్రజలలో ఆందోళన స్టార్ట్ అయింది.. దేశంలో ఈ తరహా కేసులు ప్రస్తుతం ఆరు రాష్ట్రాల్లో వెలుగు చూసినట్లు సమాచారం.