Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు అయినా జగన్ ఒంటిచేత్తో గెలవటం ప్రతిపక్షాలకు వెన్నులో వణుకు పుడుతుంది. పంచాయతీ ఎన్నికల్లో 80% గెలిచిన వైసీపీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అదే దూకుడు ప్రదర్శిస్తూ మెజార్టీ స్థానాలు గెలవడం జరిగింది. దాదాపు 72 మున్సిపాలిటీలకు.. 70కి పైగా గెలవటం మాత్రమేకాక 11 కార్పొరేషన్లకు 10 స్థానాలు గెలుచుకుంది. ఏలూరు కార్పొరేషన్ ఫలితం ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. అది కూడా వైసీపీ ఖాతాలో అనే టాక్ వినపడుతుంది. దీంతో ప్రతిపక్షం అనేది రాష్ట్రంలో తనకు లేదన్న తరహాలో జగన్.. దూకుడుగా రాణిస్తున్నారు. కనీసం ప్రచారానికి రాకుండా, ఒక్క మీడియా సమావేశం పెట్టకుండా ఓటు వేయమని అడగకుండా.. పార్టీ గుర్తు పై జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భారీ ఎత్తున రాష్ట్ర ప్రజలు వైసిపికి పట్టం కట్టడం తో… రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో తాజాగా గెలిచినా కార్పొరేషన్ స్థానాలలో ..మేయర్, డిప్యూటీ అభ్యర్థులను ప్రకటించింది వైసిపి.
వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థులు..
విశాఖ మేయర్ అభ్యర్థిగా గొలగాని హరి వెంకటకుమారి
విశాఖ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా జియ్యాని శ్రీధర్
విజయనగరం మేయర్ అభ్యర్థిగా వెంపటాపు విజయలక్ష్మి
కడప మేయర్ అభ్యర్థిగా సురేష్బాబు
విజయవాడ మేయర్ అభ్యర్థిగా భాగ్యలక్ష్మి
చిత్తూరు మేయర్ అభ్యర్థిగా అముద
తిరుపతి మేయర్ అభ్యర్థిగా డా.శిరీషా
ఒంగోలు మేయర్ అభ్యర్థిగా గంగాడ సుజాత
అనంతపురం మేయర్ అభ్యర్థిగా మహ్మద్ వసీమ్ సలీమ్
అనంతపురం డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా వాసంతి సాహిత్య