అమరావతి: మాజీ జనసేన నాయకుడు అద్దేపల్లి శ్రీధర్ వైసిపిలో చేరారు. ఏపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో బుధవారం ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేనలో పనిచేసిన అద్దేపల్లి ఎన్నికల ఫలితాల రాకముందే ఏప్రిల్ 20న జనసేనకు రాజీనామా చేశారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించిన అద్దేపల్లి గతంలో బిజెపిలోనూ పని చేశారు. చర్చా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే అద్దేపల్లి మంచి వక్తగా పేరు తెచ్చుకున్నారు.
previous post
next post