ఏపీ రి ఆర్గనైజేషన్ యాక్ట్ పై ఛాలెంజ్ చేస్తూ న్యాయస్థానంలో పిటిషన్ వేసి ఆరు సంవత్సరాల ఆరు మాసాలు అయింది. దేనికైనా కౌంటర్ వేయాలంటే నెలలోపు వేయాలి. 2014 మే 5వ తారీఖు ఇవాల్టి వరకూ దాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. ఈ విషయంపై రాష్ట్రంలో ఏర్పడిన రెండు ప్రభుత్వాలు అడగటానికి ముందుకు రావటం లేదు అన్నట్టు ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుత పరిస్థితి బట్టి వాళ్ళు మనల్ని పిలిచినప్పుడు మాత్రమే అడగాలి అన్నట్టు పరిస్థితి మారిపోయిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పిలవాలన్న, కేసు అక్కడ దాకా రాదని అక్కడక్కడే తిరుగుతుంది అని… రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ కలుగజేసుకుని అనుకూలంగా ఉపయోగించుకుంటే బాగుంటుందని పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఏపీ ఆర్గనైజేషన్ చట్టం ఈ విషయంలో కేసు వేసిన రామచంద్ర రావు కి పేరు ఏమి రాదు అని, ఆయన సీన్ అయిపోయిందని… ఆయన రాజకీయాల్లో మళ్లీ ఏ పదవులు రావాని పేర్కొన్నారు. సీఎం జగన్ ని ఉద్దేశిస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మీరు రాష్ట్రానికి ఉపయోగపడితే బాగుంటుందని సెటైర్లు వేశారు. రాజశేఖర్ రెడ్డి ప్రాజెక్ట్ అంటూ పోలవరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ… రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టాలని ఆ ప్రాజెక్టుకు కోరడం జరిగిందని గుర్తు చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి సంకల్పించిన ప్రాజెక్టు పోలవరం అని అన్నారు.
ఎన్నికలలో వైయస్సార్ అని పేరు పెట్టుకుని గెలిచారని , కాబట్టి రామచంద్రరావు వేసిన పిటిషన్ పై జగన్ ప్రభుత్వం ముందుకు కదలాలని… యాక్ట్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు ను కట్టాల్సిన బాధ్యత కేంద్రానిదే అని, ఈ సందర్భంగా అధికార పార్టీ కేంద్రాన్ని నిలదీయాలని కోరారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం ఐదు మాసాలు అయ్యింది … ఏపీ రీ ఆర్గనైజేషన్ విషయంలో కౌంటర్ పిటిషన్ ఇంకా వేయలేదని, జరిగిందే చెప్పాలని… కోరుతున్నాం గాని, మోడీని తిట్టమని ఎవరు కోరడం లేదని, బీజేపీతో విడిపోమంటలలేదే అని తెలిపారు. ఊరంతా మోడీ నీ ఈయన ఏమన్నా అంటే తీసుకెళ్లి లోపల వేస్తారని.. అంటున్నారు. అది సాధ్యమైన పనే నా..?, అంత తేలిక? అంటూ ప్రశ్నించారు.
జగన్ ని ఉద్దేశించి రాష్ట్రం కోసం నిలబడినందుకే నిన్ను గాని అంటూ జైల్లో పెడితే… రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అవుతుందని ఉండవల్లి పేర్కొన్నారు. అయితే రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేసులు కాపాడుకోవడం కోసం రాష్ట్రానికి అన్యాయం చేస్తే మాత్రం… ఏపీ జనాలు ఖచ్చితంగా క్షమించరని జగన్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. బయట జనాలంతా గమనిస్తున్నారని ఉండవల్లి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కేవలం కేసుల విషయంలోనే జగన్ సైలెంట్ అవుతున్నారని… కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం స్వార్థంగా ఆలోచిస్తే పెద్ద డ్యామేజ్ అవుతుంది అన్నట్టు ఉండవల్లి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.