Ys Jagan Mohan Reddy : వైయస్ జగన్మోహన్ రెడ్డి రోజు సంపాదన 300 కోట్లు అంటూ టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలలో అందువల్లే వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం జరిగినట్లు తాజాగా మీడియాతో చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు అన్ని విధాల అభివృద్ధి చేసిన కుప్పం నియోజకవర్గంలో కూడా వైసీపీ గెలవడానికి గల కారణం కూడా ఇదే అని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో మేలులు చేశారని, కానీ ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో డబ్బుతోనే స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలవడం జరిగిందని స్పష్టం చేశారు.
జరగబోయే జడ్పిటిసి, ఎంపిటిసి అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైసిపి గెలవటం గ్యారెంటీ అని తెలిపారు. జగన్మోహనరెడ్డికి రోజుకు 300 కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నట్లు..అది నిజమో అబద్దమో పైనున్న భగవంతునికి తెలియాలి, లేకపోతే వైయస్ జగన్ కే తెలియాలి అంటూ జేసీ దివాకర్ రెడ్డి కామెంట్ చేశారు. ప్రజల్లో మాత్రం నానుడి విపరీతంగా ఉంది అని పేర్కొన్నారు. ఈ విధంగా ప్రజాస్వామ్యం ఉందని, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మార్పులు రావాలని కోరారు.
కళ్ళముందు న్యాయవాదులను చంపేసిన ఫుటేజి అందుబాటులో ఉండగా నిందితులకు శిక్ష వేయలేని దుస్థితిలో వ్యవస్థ ఉంది అని… వ్యవస్థ మొత్తం మారాలి అంటూ జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. తప్పు దొరికిన వెంటనే శిక్ష పడే రీతిలో చట్టాలు రావాలని కోరుకున్నారు. మొత్తం మీద పంచాయతీ ఎన్నికల్లో అదే విధంగా జరగబోయే ఎన్నికల్లో వైసీపీ గెలవటానికి గల ప్రధాన కారణం అధికారము మరియు డబ్బు అదే రీతిలో పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకోవడమే అంటూ జెసి దివాకర్ రెడ్డి ఆరోపించారు.