అమరావతి, జనవరి 12: కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. 1387 కోట్ల రూపాయలతో 3.2 కిలో మీటర్ల పొడవున కృష్ణానదిపై ఇబ్రహీంపట్నం – ఉద్దండరాయపాలెంలను కలుపుతూ ఈ ఐకానిక్ వంతెనను నిర్మించనున్నారు. భారతీయ యోగముద్రతో బ్రిడ్జి డిజైన్ రూపొందించిన ఎల్ అండ్ టి సంస్థ తక్కువ పిల్లర్లు, ఎక్కువ కేబుల్స్తో నిర్మాణం చేయనుంది. హైదరాబాదు, భద్రాచలం హైవేల నుండి విజయవాడ రాకుండా నేరుగా అమరావతికి వెళ్లేందుకు ఈ బ్రిడ్జి ఉపయోగపడుతుంది.
అమరావతికి తాగునీటి అవసరాల కోసం 750 కోట్లతో నిర్మించే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కూ సిఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో వీటి నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎంపి కేశినేని నాని, కలెక్టర్ లక్ష్మీకాంతం వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్లొన్నారు.