ఒంగోలు, జనవరి 9: వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రామాయపట్నంలో కాగితపు పరిశ్రమకు, పోర్టు నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన జన్మభూమి – మావూరు సభలో పాల్లొని ప్రసంగించారు.
ఓడ రేవు నిర్మాణం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆక్వారంగానికి రాయితీలు ఇస్తాం. రైల్వే కనెక్టివిటి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు అన్నారు
విద్యుత్తు ఆదా కోసం ఎల్ఇడి బల్పులు వినియోగిస్తున్నాం. రాష్ట్రంలో ఇప్పటి వరకూ పేదలకు 27లక్షల గృహాల నిర్మాణం చేశాం. వీటి కోసం 83వేల కోట్లు రూపాయలు ఖర్చు పెట్టాం. ఇళ్ల నిర్మాణాల కోసం ఈ జన్మభూమిలో ఎన్ని అర్జీలు వచ్చినా అందరికీ అనుమతి పత్రాలు మంజూరు చేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం
రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకువెళుతుంటే ప్రతిపక్షాలు దివాలాకోరు రాజకీయాలతో ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
కేంద్రంలోని బిజెపి అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిందని ఆయన విమర్శించారు.