Ap Curfew: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జులై మొదటి తారీకు నుండి ఏడవ తారీఖు వరకు కొత్త ఆంక్షలు విధించడానికి ప్రభుత్వం రెడీ అయ్యింది. కోవిడ్ పాజిటివ్ రేటు 5 శాతం కంటే తక్కువగా ఉన్న జిల్లాలలో కర్ఫ్యూ సడలింపు ఇవ్వటం జరిగింది. ఈ జిల్లాలో ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సమయాన్ని వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉభయ గోదావరి, చిత్తూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలలో ప్రస్తుతం కొనసాగుతున్న ఆంక్షలు రాబోయే రోజుల్లో కొనసాగనున్నాయి.
ఈ జిల్లాలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఆంక్షలు కార్యకలాపాలు కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది. తాజాగా తీసుకున్న ఆంక్షలు జులై 1వ తారీఖు నుండి ఏడవ తారీఖు వరకు రాష్ట్రంలో అమలు అవుతాయని స్పష్టం చేశారు. కోవిడ్ పాజిటివ్ రేటు 5 శాతం కంటే తక్కువ గా ఉన్న.. గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, అనంతపురం, విశాఖపట్టణం, విజయనగరం జిల్లాలో .. ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కార్యకలాపాలకి అనుమతులు ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.