ఏపీ రాజధానిగా అమరావతి నే ఉంచాలని టిడిపి పార్టీ నాయకులు చెయ్యని ప్రయత్నం లేదు. అయినాగాని మరొక పక్క జగన్ అవేమీ పట్టించు కోకుండా తన పంతనా దూసుకుపోతున్నారు.
కేంద్ర ప్రభుత్వం నుండి మరోపక్క గవర్నర్ నుండి మూడు రాజధానుల నిర్ణయానికి చట్టబద్ధత దాదాపు కల్పించే రీతిలో వ్యవహరించారు. ఇటువంటి తరుణంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అమరావతి విషయంలో కొత్త స్ట్రాంగ్ ప్లాన్ తో బరిలోకి దిగుతున్నారు అని వార్తలు వైరల్ అవుతున్నాయి.త్వరలోనే అమరావతి రైతుల కోసం దీక్ష చేయడానికి రెడీ అవుతున్నట్లు, ఒకపక్క కరోన ఉన్నాగాని దీక్ష చేయడానికి గల్లా జయదేవ్ సరికొత్త ప్లాన్ వేసినట్లు టిడిపి పార్టీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
తాను చేపట్టే దీక్ష తో ఏకంగా కేంద్ర ప్రభుత్వం లో కదలిక వచ్చే రీతిలో సరి కొత్త స్ట్రాటజీ తో గల్లా జయదేవ్ ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా గుంటూరు జిల్లా పార్లమెంటు సభ్యులు ఇవ్వండి గల్లా జయదేవ్ అమరావతి రైతుల కోసం ఏం మాట్లాడటం లేదు అని ఆరోపణలు ఇటీవల వస్తున్న తరుణంలో వాటన్నిటికీ తన దీక్ష ద్వారా చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారట.
మరి జగన్ ముందు ఇవన్నీ పనిచేస్తాయా..? ఇప్పటికే చాలా మంది రాజధాని రైతులు ఇప్పటి వరకు చేసిన దీక్షలను పట్టించుకోలేదు, మరి గల్లా జయదేవ్ చేపట్టే దీక్ష ని పట్టించుకుంటారా అన్నది సస్పెన్స్ గా ఉంది. అదే రీతిలో కేంద్ర ప్రభుత్వం ని జగన్ మీద ఎగదోసేలా గల్లా జయదేవ్ చేసే ప్రయత్నాలు…. ఏ మాత్రం ఫలిస్తాయో అన్నది కూడా ఎవరికీ అర్థం కావటం లేదు.
మరోపక్క రాజధాని రైతులు న్యాయస్థానంలో చేస్తున్న పోరాటానికి జాతీయస్థాయిలో లాయర్లు మద్దతు తెలుపుతూ వస్తున్నారు. ఏది ఏమైనా అమరావతి రాజధాని విషయంలో టిడిపి మరియు ఆ ప్రాంత రైతులు తప్పా పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదని ఏపీ మీడియాలో మరియు రాజకీయాలలో వినపడుతున్న టాక్.