జూన్ 15వ తారీకు ఇండియా చైనా సరిహద్దు ప్రాంతం గాల్వాన్ లోయ దగ్గర కవ్వింపు చర్యలకు పాల్పడినా చైనా ఆర్మీ కి ఇండియా ఆర్మీ….చైనా సైనికులను పరిగెత్తించి పరిగెత్తించి చంపారు. మొదటిలో ఇండియా దేశానికి చెందిన ఆర్మీ 20 మంది చనిపోయిన చైనా సైనికులు పెద్దగా చనిపోనట్లు డ్రాగన్ కంట్రీ కల్లబొల్లి మాటలు చెప్పుకొచ్చింది. అయితే ఆ తర్వాత ఆ దేశానికి చెందిన సీనియర్ సైనిక అధికారి గాల్వాన్ లోయ దగ్గర భారత్ ఆర్మీ చేతిలో దాదాపు 150 మంది చైనా సైనికులు చనిపోయినట్లు ఇటీవల వ్యాఖ్యలు చేయడంతో ప్రపంచం మొత్తం ఇండియన్ ఆర్మీ పవర్ కి షేక్ అయిపోయింది. దీంతో ప్రజెంట్ చైనా దేశంలో గాల్వాన్ లోయ దెబ్బకి వాళ్ళల్లో మార్పు వచ్చినట్లు ఇటీవల ఆ దేశం వ్యవహరిస్తున్న తీరు బట్టి కామెంట్ లు అంతర్జాతీయ స్థాయిలో వస్తున్నాయి.
ఇప్పటికే ఇండియా చైనా దేశానికి చెందిన 59 యాప్స్ పై నిషేధం విధించింది. ఆ తరువాత ప్రధాని మోడీ లడఖ్ లో పర్యటించి దెబ్బకి దెబ్బ తీయాలి అన్నట్టుగా ప్రసంగించడం సైనికులలో ధైర్యాన్ని నింపడం జరిగింది. ఇదే టైం లో అగ్రరాజ్యం అమెరికా సైతం చైనాని విమర్శిస్తూ ఇండియా కి సపోర్ట్ చేస్తూ వస్తోంది. అంతేకాకుండా అవసరమైతే ఇండియాకు అనుకూలంగా అమెరికా బలగాలు దించుతామని హెచ్చరించింది. మరోపక్క కరోనా కారణంగా చాలా దేశాలు చైనా ని వ్యతిరేకిస్తున్నాయి. ఇటువంటి సమయంలో ఇండియా చాలా వ్యూహాత్మకంగా డ్రాగన్ కంట్రీ ని ఆర్ధికంగా చాల విషయాలలో దెబ్బ కొట్టడం తో చైనా కాళ్లబేరానికి వచ్చింది. ఇండియా తమకు శత్రుదేశం కాదని, శాశ్వత మిత్ర దేశం అని ఇండియాలోని చైనా రాయభారి సన్ విడాంగ్ పేర్కొన్నాడు. సామరస్య వాతావరణంలో అన్ని సమస్యలు శాంతియుతంగా పరిష్కరించుకుంటామని, భారత్- చైనా మధ్య సంబంధాలు తిరిగి గాడిన పెట్టడానికి చర్చలు జరుపుతున్నామని అన్నారు.