బీసీసీఐ బోర్డు అధ్యక్షుడు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గుండెపోటు వచ్చింది. చాతిలో నొప్పి రావడంతో వెంటనే ఆయన ఇటీవల పశ్చిమబెంగాల్లో కోల్ కతా వుడ్ ల్యాండ్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం కల్లా గంగూలికి యాంజియో ప్లాస్టీ పరీక్షలు చేయాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. సరిగ్గా శనివారం ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో గంగూలికి ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి హాస్పిటల్ కి తరలించారు. దీంతో క్రికెట్ అభిమానులతో పాటు చాలా మంది ప్రముఖులు ఈ వార్త తెలుసుకుని ఒక్కసారిగా షాక్ తిన్నారు.
ఇదిలా ఉండగా సౌరవ్ గంగూలీ కి గుండెపోటు రావడం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అదే విధంగా కొంతమంది బిజెపి నేతలు విచారం వ్యక్తం చేశారు. అంత మాత్రమే కాకుండా త్వరగా కోలుకోవాలని కూడా ఆకాంక్షించారు. భారత్ క్రికెట్ చరిత్రలో టీమిండియాకు కెప్టెన్ గా సౌరవ్ గంగూలీ ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించి ఇప్పుడు భారత్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా ఉంటూ కెరియర్ కొనసాగిస్తున్నారు.
కాగా త్వరలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న క్రమంలో ఇటీవల గంగూలీ గవర్నర్ తో భేటీ అయిన ఈ సందర్భంలో బీజేపీలో జాయిన్ అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ మర్యాదపూర్వకంగా గవర్నర్ తో బెంగాల్ దాదా భేటీ అయినట్లు అప్పట్లో రాజ్ భవన్ అధికారులు వెల్లడించడం జరిగింది. కాగా ప్రస్తుతం గంగూలీకి గుండె నొప్పి రావటం వెంటనే హాస్పిటల్ లో జాయిన్ అవ్వడం టెస్టులు చేయగా వచ్చిన రిపోర్టులు బట్టి చూస్తే గుండెలో బ్లాకులు ఉన్నాయని..స్టంటు వేయాలని 48 గంటల పాటు హాస్పిటల్ లోనే అబ్జర్వేషన్ లో గంగూలీ ఉంటారని సాయంత్రం వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. దీంతో భారత్ క్రికెటర్లు మరియు అభిమానులు మరింత ఆందోళన చెందుతున్నారు.