ఉత్తరాంధ్ర కీలక నాయకుడు గంటా శ్రీనివాసరావు ఇటీవల వైసీపీ పార్టీలో చేరడానికి మొత్తం రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. జగన్ సమక్షంలో గంటా శ్రీనివాసరావు తో పాటు కొంతమంది ఉత్తరాంధ్ర ప్రాంతంలో టిడిపి నాయకులు చేరుతున్నట్లు, ముహూర్తం ఫిక్స్ చేసినట్లు మొన్నటిదాకా వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా గంటా వైసీపీ లోకి రావటం మేటర్ చాలా సైలెంట్ అయిపోవటం, ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.
పూర్తి విషయంలోకి వెళితే ముందునుండి గంటా శ్రీనివాసరావు పార్టీలోకి తీసుకోవద్దని వైసిపి సీనియర్ నేత విజయసాయిరెడ్డి తో పాటు అదే ప్రాంతానికి చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ వైసిపి హైకమాండ్ కి చెబుతూ వస్తున్నారు. అయితే ఇటీవల గంటా శ్రీనివాసరావు పార్టీలోకి వస్తే ఎవరికి ఉపయోగం అనేదాని గురించి ప్రత్యేకమైన సర్వే ఒకటి జగన్ చేయించినట్లు…. ఈ విషయంలో వైసీపీ లోకి వస్తే అది గంటాకే బెనిఫిట్ అన్నట్లు తేలిందట.
గంటా రావడం వల్ల పార్టీకి గాని ప్రభుత్వానికి గాని ఒరిగేదేమీ లేదని జగన్ చేయించిన సర్వేలో బయటపడినట్లు సమాచారం. అంతేకాకుండా గంటా శ్రీనివాస్ వస్తే కచ్చితంగా గ్రూపు రాజకీయాలు స్టార్ట్ అవుతాయి అని గుర్తించారట. ఈ నేపథ్యంలో విశాఖ లో రాజధాని వస్తున్న తరుణంలో ఇలాంటి క్యాండిడేట్ పార్టీలో ఉంటే, పార్టీకి నష్టమని జగన్ అనుకుని ఈ విషయాన్ని లైట్ తీసుకున్నట్లు సమాచారం.