ఢిల్లీ,జనవరి 26: ప్రధానమంత్రి మోది తన బహుమతులను ‘నమామి గంగే’ ప్రాజెక్టుకోసం వేలం వేయనున్నారు. దేశ ప్రధానిగా మోదీ గత నాలుగున్నరేళ్ల కాలంలో దేశ,విదేశాల్లో పలుచోట్ల పర్యటించిన సదర్భంగా ఆహుతులు అందించిన బహుమతులను ఈనెల 27,28తేదీల్లో ఢిల్లీలోని మోడరన్ ఆర్ట్ గ్యాలరీలో ఆక్షన్ నిర్వహించనున్నట్లు కేంద్ర సంస్కృతిక శాఖా మంత్రి డా. మహేశ్ శర్మ తెలిపారు.
సుమారు 1900 బహుమతులు, జ్ఞాపికలను వేలం వేయనున్నట్లు ఆయన చెప్పారు.
ప్రధాని మోది తన బహుమతులను దేశంకోసం సమర్పించారని ఆయన వ్యాఖ్యానించారు.