NewsOrbit
రాజ‌కీయాలు

Ys Jagan: లండన్ న్యాయస్థానంలో నెగ్గిన జగన్ ప్రభుత్వం..!!

Ys Jagan: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాకియా సంస్థ విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై లండన్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ మన్యం కి బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి వ్యతిరేకంగా దుబాయ్ కి చెందిన రస్ అల్ ఖైమా కంపెనీ… ఒప్పందం రద్దు చేసుకోవడం తో రాకియా కంపెనీ ఏపీ ప్రభుత్వం పై తమకు నష్టపరిహారం ఇవ్వాలని లండన్ ఆర్బిట్రేషన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాదాపు 273 మిలియన్ డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని రాకియా ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చింది.

GOI and Govt. of AP wins Case in International Arbitration Tribunal, London against Rakia.

ఈ విషయంలో పలుమార్లు ప్రభుత్వం తరపున ప్రతినిధులు మధ్యవర్తిత్వం ద్వారా కేసును పరిష్కరించాలని చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. అయినా గాని రాకియా ఎక్కడ వెనక్కి తగ్గలేదు అంగీకరించలేదు. దీంతో ఏపీ ప్రభుత్వం న్యాయ పోరాటానికి సిద్ధం అయింది. సీఎం జగన్ సూచనలతో అధికారులు మరియు న్యాయ నిపుణులు పకడ్బందీగా లండన్ ఆర్బిట్రేషన్ కోర్టులో తమ వాదనలు వినిపించారు. దీంతో లండన్ న్యాయస్థానం ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయనిపుణులు ప్రతినిధులు వినిపించిన వాదనలను ఏకీభవిస్తూ… ఈ కేసు తమ పరిధిలోకి రాదని కేసును కొట్టి వేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

దీంతో ఏపీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ ఇచ్చినట్లయింది. 2007వ సంవత్సరంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. విశాఖ జిల్లాలో ఉన్న బాక్సైట్ వినియోగించుకుని అల్యూమినియం పరిశ్రమ ఏర్పాటు చేయడానికి రాకియాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాల వల్ల గిరిజన సంస్కృతి విఘాతం ఏర్పడుతుందని స్థానికుల నుండి పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో రాకియా కంపెనీతో ఉన్నట్టుండి ఏపీ ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. ఒప్పందం రద్దుతో రాకియా కంపెనీ 273 మిలియన్ డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానంలో పిటిషన్ వేయగా… ఈ విషయంలో న్యాయస్థానంలో ఏపీ ప్రభుత్వం పోరాడి చివరికి గెలిచింది.

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju