ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల ఈ విషయంలో చాలా కాలం తర్వాత గుడ్ న్యూస్ లాంటి వార్తలు వైద్య రంగం నుండి వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే రాష్ట్రంలో ఒకానొక సమయంలో రోజుకి పది వేల పాజిటివ్ కేసులు నమోదు అవటం జరిగాయి. దెబ్బకి ఏపీ లో ఉన్న జనాలంతా లాక్ డౌన్ ఎత్తివేసిన గాని ఇంటి నుండి బయటకు అడుగు పెట్టడానికి ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ఇదే సమయంలో విపక్షాల నుండి ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
కరోనా కట్టడి చేయడంలో వైయస్ జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఇలా అనేక రీతులుగా విమర్శలు చేశారు. మరోపక్క మాత్రం దేశంలో ఏ రాష్ట్రంలో జరగని కరోనా నిర్ధారణ పరీక్షలు జరగటం వల్ల….. కేసులు బయట పడుతున్నాయని, దానివల్ల భయపడాల్సిన అవసరమేమీ లేదని అధికార పార్టీ వైసీపీ నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. కాగా గత నాలుగైదు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో అంతకంతకూ తగ్గుతూ వస్తుంది.
ఇటీవల దాదాపు 50 వేలకు పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు జరపగా వాటిలో ఏడు వేలకు పైగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. మొత్తంమీద చూసుకుంటే గతంలో కంటే ప్రస్తుతం ఏపీలో కరోనా చాలావరకు కంట్రోల్ అయ్యిందని వైద్య నిపుణులు చెప్పుకొస్తున్నారు. డెత్ రేట్ విషయంలో రికవరీ రేటు విషయంలో గతంలో కంటే మెరుగైన స్థానంలో ఏపీ ఉంది. మొత్తంగా చూసుకుంటే తూర్పుగోదావరి అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ పరిస్థితి కొద్దిగా ప్రమాదకరంగా ఉండగా మిగతా జిల్లాలలో చాలా వరకు కంట్రోల్ లోకి వచ్చినట్లు…. బయటపడిన కరోనా లెక్కల బట్టి అధికారులు వైద్యనిపుణులు చెప్పుకొస్తున్నారు.