Ys Jagan: దేశంలో కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కంటికి కనిపించని… ఈ శత్రువుతో వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ బాగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలో ప్రతి పాలకుడికి ఒక సరికొత్త సవాల్ వైరస్ రూపంలో వచ్చిన క్రమంలో ఇండియాలో సమర్థవంతంగా కరోనా వైరస్ ని ఎదుర్కొంటూ..మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తూ వస్తున్నారు ఏపీ సీఎం జగన్. కరోనా ట్రీట్ మెంట్ విషయంలో రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం ఖర్చులేకుండా .. ఆరోగ్య శ్రీ లో చేర్చి ఎంతో మంది ప్రాణాలకు ఊపిరి పోశారు.
వైద్య పరంగా రాష్ట్రంలో బెడ్లు, ఆక్సిజను కొరత లేకుండా ..ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకుంటూ .. కరోనా వచ్చిన పేషెంట్ కి బెడ్ దొరకడం మొదలుకుని డిశ్చార్జ్ అయ్యేంతవరకు మంచి డైట్ అందిస్తూ ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో 104 పనితనం మెరుగుపరిచి జిల్లా కలెక్టర్లను.. అప్రమత్తం చేసి.. కరోనా ప్రత్యేక పర్యవేక్షణ కార్యక్రమాలు మంత్రులకి అప్పజెప్పి ప్రత్యేక కమిటీలు నియమించడం జరిగింది. అంతేకాకుండా .. ఎక్కడా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజలను దోచుకోకుండా టాస్క్ ఫోర్స్ ను నియమించారు. ఈ రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారిని వైద్యులు దోచుకోకుండా మరోపక్క వైద్యానికి సంబంధించి మెడిసిన్లు తక్కువ కాకుండా ప్రభుత్వం పక్కా యాక్షన్ ప్లానింగ్ తో వైరస్ తో యుద్ధం చేస్తూ ప్రజల ప్రాణాలు కాపాడుతోంది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. చాలా రాష్ట్రాల్లో కరోనా బారినపడి ట్రీట్మెంట్ కి డబ్బులు కట్టలేక.. హాస్పిటల్ కి వెళ్ళ లేక.. ఇంటి వద్దనే ఉంటూ ప్రాణాలు విడుస్తున్నారు. దేశంలో పరిస్థితి ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా కరోనా రికవరీ రేటు ఉన్నట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. రోజు రోజుకి రాష్ట్రవ్యాప్తంగా రికవరీ రేటు ల సంఖ్య పెరుగుతున్నట్లు.. దేశంలో మరణాల విషయంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో తక్కువగానే ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఇటీవల తెలియజేశారు. ఒకపక్క అధికార యంత్రాంగాన్ని మరోపక్క వైద్య యంత్రాంగాన్ని సమపాళ్ళలో అలర్ట్ చేస్తూ జగన్ ప్రభుత్వం ఏపీలో కరోనా బారిన పడుతున్న వారికి సరైన చికిత్స అందిస్తున్నట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి.