ఏపీలోని వివిధ జిల్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది అక్కడి ప్రభుత్వం. ఖాళీగా ఉన్న 2624 ఉద్యోగాల భర్తీకి ప్రకటనలను వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకాకుంళం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఖాళీగా ఉన్న 2624 గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీనికి ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.
దీనిలో భాగంగా ప్రభుత్వ పథకాలపై అవగాహన, కమ్యునికేషన్ నైపుణ్యాల ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం ఖాళీలు 2624 ఉండగా అందులో శ్రీకాకుళం 451, నెల్లూరు 211, అనంతపురం 981, చిత్తూరు 981 ల పోస్టులను కేటాయించింది.
ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థి పదోతరగతి ఉత్తీర్ణత సాధించాలి. అలాగే స్థానిక గ్రామ పంచాయతీ పరిధిలోనే నివసించాలి. చివరి తేదీలు జిల్లాల ప్రకారం.. నెల్లూరు 24.10.2020, చిత్తూరు 25.10.2020, శ్రీకాకుళం 22.10.2020, అనంతపురం 31.10.2020 గా ఉంటాయి. https://apgv.apcfss.in/ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?