ఇటీవల బీజేపీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి పార్టీ పగ్గాలను సోము వీర్రాజుకి అప్పచెప్పటం అందరికీ తెలిసిందే. అంతకు ముందు ఉండే కన్నా లక్ష్మీనారాయణను పక్కనపెట్టి సోము వీర్రాజు కి బిజెపి అధికార బాధ్యతలు ఇవ్వటంతో చాలావరకు వైసిపి పార్టీ నేతలలో సంతోషం నెలకొంది. ముఖ్యంగా ఈ వార్త హాస్పిటల్ లో ఉన్న వైసిపి పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి కి గుడ్ న్యూస్ అని చాలామంది అంటున్నారు. ఎందుకంటే గత అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చాలా వరకు చంద్రబాబు అండ్ కో డైరెక్షన్ లో పని చేశారని, దానివల్ల వైసీపీ ప్రభుత్వం ప్రజల కోసం మంచి నిర్ణయాలు తీసుకున్న వ్యతిరేకించిన సందర్భాలున్నాయి.
కానీ కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు సోము వీర్రాజు వైసీపీ పార్టీకి కాస్త సానుకూలంగానే వ్యవహరిస్తారని, తప్పు చేస్తే ఖచ్చితంగా నిలదీసే వ్యక్తి అని, నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించే నాయకుడు అని బలంగా నమ్ముతున్నారు. ముఖ్యంగా చంద్రబాబుని గాని ఆయన మనుషుల్ని గాని నమ్మే వ్యక్తి కాదని, సోము వీర్రాజుని నియమించడం పట్ల వైసీపీ నేతలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. ఇదే రీతిలో పార్టీ పగ్గాలు అప్పజెప్పిన వెంటనే సోము వీర్రాజు రంగంలోకి దిగి చంద్రబాబుని టార్గెట్ చేసుకుని విమర్శల వర్షం కురిపించడం తో పాటు రాబోయే రోజుల్లో చంద్రబాబు కి బీజేపీకి ఎటువంటి సంబంధం ఉండదని తేల్చి చెప్పే రీతిలో వ్యవహరించడంతో, ఇది ఖచ్చితంగా హాస్పిటల్ లో ఉన్న విజయసాయి రెడ్డి కి గుడ్ న్యూస్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎందుకంటే ఇప్పుడు తమతోపాటు సోము వీర్రాజు కూడా ఎక్కువగా చంద్రబాబు ని టార్గెట్ చేసే అవకాశం ఉండటంతో మరింతగా టీడీపీని దెబ్బ కొట్టవచ్చు అనే ఆలోచనలో ఉన్నారట. ఏది ఏమైనా ఏపీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు మారటంతో ఏపీ లో రాజకీయ సమీకరణాలు చాలావరకు మారాయని విశ్లేషకులు భావిస్తున్నారు.