ఏపీలో ప్రధాన నగరంగా ఉన్న విజయవాడ నగరానికి మరో మణిహారం రూపుదిద్దుకుంది అదే కనకదుర్గ ఫ్లైఓవర్. ఎప్పటి నుండో విజయవాడ వాసులు కనకదుర్గ గుడి దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలని ఎన్నో సంవత్సరాల నుండి డిమాండ్ చేయడం జరిగింది. తాజాగా వారు పడుతున్న ట్రాఫిక్ కష్టాలకు…. ఇటీవల ఫైర్ఫ్లైఓవర్ నిర్మాణంతో పుల్ స్టాప్ పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ట్రైల్ రన్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. విజయవాడ నుండి హైదరాబాద్ నగరంకి వెళ్లే మార్గంలో, ఈ ప్రాంతం వద్ద ఎన్నో ఏండ్ల నుండి ప్రజలు ట్రాఫిక్ సమస్య అనుభవించారు.
ప్రధాన వాహనాలు వెళ్లడానికి, రావడానికి ఇదే ప్రధాన మార్గం కావటం తో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించాలని, ఫ్లై ఓవర్ కట్టాలని అనేక ప్రభుత్వాలు భావించాయి. గత ప్రభుత్వం చంద్రబాబు హయాంలో కూడా చర్చలు జరగగా, పూర్తి పనులు మొదలు పెట్టే సమయానికి ఎన్నికలు రావడం చంద్రబాబు ఓడిపోవడం జరిగాయి. ఆ తర్వాత రంగంలోకి దిగిన వైయస్ జగన్ ప్రభుత్వం… దుర్గ గుడి ఫ్లైఓవర్ విషయంలో చకచకా పనులు స్టార్ట్ చేసి 14 నెలల కాలంలోనే పూర్తి చేయడం జరిగింది.
ఫ్లైఓవర్ పూర్తి కావడం విషయంలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని కూడా కీలక పాత్ర పోషించటం జరిగింది. అయితే ఫ్లైఓవర్ మొత్తం పూర్తవడంతో వచ్చే నెల 4వ తారీకు కనకదుర్గ వారధి బెంజ్ సర్కిల్ ప్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరి రానున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి ఈ ఫ్లైఓర్ కోసం అనేక పార్టీలు, ప్రభుత్వాలు తీవ్రస్థాయిలో కృషి చేయాగా తాజాగా అవి నెరవేరడంతో, విజయవాడ ప్రజలకు ఇది ఖచ్చితంగా ఒక సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.