వైయస్ జగన్ ఎప్పుడైతే 3 రాజధానుల నిర్ణయం తెరపైకి తీసుకువచ్చారో అమరావతి పై నీలినీడలు కమ్ముకున్నాయి. జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఒక్కసారిగా ప్రభుత్వంపై తిరగబడి ఆందోళనలు, ధర్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు సీఎం జగన్ అమరావతి రాజధాని రైతులతో మాట్లాడిన సందర్భాలు లేవు. ఇటువంటి తరుణంలో త్వరలోనే అమరావతి రైతులతో సీఎం జగన్ సమావేశం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కాగా మొదటిలోనే ఒకానొక సమయంలో జగన్ వారితో నేరుగా మాట్లాడటానికి రెడీ అయినట్లు, వారి అనుమానాలు తొలగించడానికి సిద్ధమైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ ఆ సమావేశం జరగలేదు. ఇదిలా ఉండగా త్వరలో మూడు విడతలుగా అమరావతి రైతులతో సీఎం జగన్ సమావేశాలు నిర్వహించడానికి రెడీ అయినట్లు ప్రభుత్వ వర్గాల్లో టాక్ వస్తోంది. వారి బాధ ఏమిటో అన్ని విషయాలు వైయస్ జగన్ ఫేస్ టు ఫేస్ రాజధాని రైతులతో ముచ్చటించడానికి రెడీ అవుతున్నట్లు దీనికి సంబంధించి క్యాబినెట్ మంత్రులతో కూడా జగన్ ఆల్రెడీ చర్చించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఎప్పటి నుండో అమరావతి రైతులు కూడా ముఖ్యమంత్రితో మాట్లాడాలి అని అనుకుంటున్న సంగతి తెలిసిందే. కనీసం ధర్నాలు, ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వం నుండి స్పందన లేదని, గత కొంత కాలం నుండి రాజధాని రైతులు మీడియా ముందు తమ బాధను వెళ్లబుచ్చుతూ వచ్చారు. ఇలాంటి తరుణంలో నేరుగా ఇప్పుడు వైయస్ జగన్ నుండి పిలుపు రానున్నట్లు వార్త బయటకు రావటంతో ఇది అమరావతి రైతులకు కచ్చితంగా…. గుడ్ న్యూస్ అని రాజకీయ మేధావులు అభివర్ణిస్తున్నారు. ఈ సమావేశాలలో అమరావతి ఇష్యూ చాలావరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందని, లేకపోతే మరింత వివాదాస్పదం అవడం గ్యారెంటీ అని పేర్కొంటున్నారు. మరి అమరావతి రైతులతో జగన్ సర్కారు ఎప్పుడు సమావేశాలు నిర్వహిస్తుందో చూడాలి.