దేశంలో త్వరలో చాలా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే కరోనా వైరస్ కారణంగా చాలా రాజకీయ పార్టీల నుంచి ఎన్నికల వాయిదా వెయ్యాలి అంటూ వినతులు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. పరిస్థితి ఇలా ఉండగా కేంద్ర ఎన్నికల సంఘం వస్తున్న వార్తలకి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో పూర్తి స్పష్టత ఇచ్చేసింది. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఎన్నికలలో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది.
దీనిలో భాగంగా బీహార్ రాష్ట్రానికి ఈ అక్టోబర్….నవంబర్ లో జరగాల్సిన ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని క్లారిటీ ఇచ్చింది. బీహార్ రాష్ట్రంలో మొత్తం 243 స్థానాలకు నవంబర్ 29 తో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు తాజా ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ బట్టి తేలింది. మొదటి నుండి బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా వేయాలని ప్రతిపక్షం ఆర్జెడి, ఎల్జిపి కోరటం జరిగాయి. అంతే కాకుండా లెటర్ కూడా రాయడం జరిగింది. కానీ ఎన్నికల సంఘం మాత్రం యధావిధిగా బీహార్ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది.
అంతే కాకుండా కొత్త మార్గదర్శకాలతో ఎన్నికలు జరుగుతాయని ఓటర్లకు గ్లౌజులు ఇవ్వడంతో పాటు పోలింగ్ కేంద్రాల్లో శానిటేషన్, ధర్మల్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాబోతుంది. ఇంటింటికీ మార్గదర్శకాలు రూపొందించడంతో పాటు… ఆన్లైన్ పద్ధతిలో నామినేషన్లు దాఖలు చేసే విధానానికి తెర తీసింది. దీంతో ఎన్నికలు ఎప్పటిలాగానే షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని తన తాజా ప్రకటనతో క్లారిటీ ఇచ్చింది.
పరిస్థితి ఇలా ఉండగా ఏపీలో జరగాల్సిన స్థానిక ఎన్నికల విషయంలో మొదటి నుండి ఉత్సాహంగా ఉన్న వైయస్ జగన్ పార్టీకి కరోనా రాకతో అడ్డుకట్ట పడినట్లయింది. దీంతో స్థానిక ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ కొంత ప్రభుత్వాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించినట్లు మొన్నటివరకు పరిస్థితి ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అదంతా అటుంచితే… ఇటీవల వైయస్ జగన్ “వైయస్సార్ చేయూత” కార్యక్రమం తో రాష్ట్రంలో చాలా మంది ఆడపడుచులకు డబ్బులు ఇవ్వడం తెలిసిందే. దీంతో వైసిపి పార్టీపై ప్రజలలో మరింతగా నమ్మకం పెంచే విషయంలో వైస్ జగన్ సక్సెస్ సాధించినట్లు తేలింది.
ఇదే సరైన సమయమని బీహార్ ఎన్నికలు జరిగే సమయంలో ఏపీలో కూడా ఎలక్షన్ కమిషన్ స్థానిక ఎన్నికలు కండక్ట్ చేసే అవకాశం ఉందని వైయస్ జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ టైంలో నిజంగా ఎన్నికలు జరిగితే ఏపీ మొత్తం స్థానిక ఎన్నికలలో విజయబావుటా ఎగరవేయడం గ్యారెంటీ అని అభిప్రాయపడుతున్నారు. నిజంగా బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగే సమయంలో ఇక్కడ కూడా జరిగితే….. వైయస్ జగన్ కి ఇది కచ్చితంగా గుడ్ న్యూస్ అని అంటున్నారు.