అనంతపురం జిల్లాలో బుధవారం జరిగిన ఒక ఘటన వైఎస్ జగన్ ఎంతో సదుద్దేశంతో అమలుచేస్తున్న గ్రామ వాలంటీర్ వ్యవస్థపై మాయని మచ్చగా నిలిచింది. వివరాల్లోకి వెళితే పెనుకొండ మండలం కొండంపల్లిలో ఒక గ్రామ వాలంటీర్ వృద్ధాప్య పింఛను సొమ్ముతో పరారయ్యాడు.
స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. హనుమంతు నాయక్ అనే వ్యక్తి స్థానికంగా గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. ప్రతీ నెలలానే ఈసారి కూడా వృద్ధులకు, వికలాంగులకు పింఛన్ సొమ్ము అందించేందుకు స్థానిక వెల్ఫేర్ అధికారిణి హీరా నుండి 49 మందికి ఫించను అందించేందుకు రూ.63,500 తీసుకున్నాడు. ఆ తర్వాత నుండి హనుమంతు ఆచూకీ లేదు. స్థానికంగా గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?