కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం మార్చి నెల నుండి అంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దేశంలో ఎప్పుడైతే మొట్టమొదటి కరోనా వైరస్ పాజిటివ్ కేసు బయటపడిందో అప్పుడే ఇతర దేశాల నుండి విమాన రాకపోకలు ఆగిపోయాయి. మధ్యలో “వందే భారత్ మిషన్” అంటూ విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశం లోకి తీసుకు వచ్చే రీతిలో వ్యవహరించిన మహమ్మారి బాగా ప్రబలడంతో… ఆ నిర్ణయాన్ని కూడా పక్కన పెట్టేశారు.
దీంతో చాలా మంది విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు.. అంతర్జాతీయ విమాన రాకపోకలకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో అన్న రీతిలో వెయిట్ చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో తాజాగా కేంద్ర హోంశాఖ అంతర్జాతీయ విమాన రాకపోకలకు సంబంధించి ఆంక్షలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
దేశంలోకి ఇతర దేశాల నుంచి భారతీయులు విదేశీయుల రాకపోకలపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం పర్యాటక వీసా మినహా అన్ని వర్గాల ప్రయాణాలకు అనుమతులు ఇస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో ఆరోగ్య శాఖ సూచించిన ప్రకారం నిబంధనలను పాటించే విధంగా కేంద్ర హోం శాఖ అనుమతులు జారీ చేసింది. దీంతో ఇప్పటి నుండి విదేశాల నుండి ఇండియా కి, ఇండియా నుండి విదేశాలకు జల మరియు వాయు మార్గం ద్వారా రాకపోకలకు అనుమతులకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లయింది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న వీసాలు అన్నిటినీ యాక్టివ్ చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది.