Corona : దేశంలో కరోనా కొత్త కరోనా కేసులు రికార్డు స్థాయిలో బయట పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా దేశంలో సగానికి పైగా కేసులు మహారాష్ట్రలో నమోదు కావడంతో ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ రాత్రిపూట కర్ఫ్యూ విధించడంతో జరిగింది. అంత మాత్రమే కాక 144 సెక్షన్ ఉదయం వరకు విధిస్తూ వీకెండ్ లాక్ డౌన్ అమలు చేస్తూ ఉంది. ఈ విధంగా ఈ నెలాఖరు వరకు మహారాష్ట్ర సర్కార్ కరోనా కట్టడి కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో కూడా కేసులు పెరుగుతూ ఉండటంతో కేజ్రీవాల్ ప్రభుత్వం నిన్నటి నుండి రాత్రిపూట కర్ఫ్యూ విధించే రీతిలో నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. మేటర్ లోకి వెళ్తే రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఢిల్లీ సర్కార్ నైట్ పూట కర్ఫ్యూ విధించడం జరిగింది. ఇప్పుడు ఇదే జాబితాలో కి గుజరాత్ రాష్ట్రం కూడా చేరిపోయింది. కొద్ది రోజుల నుండి గుజరాత్ రాష్ట్రంలో కేసులో ఊహించని విధంగా పెరుగుతుండటంతో.. ఆ రాష్ట్రంలో 20 ప్రధాన నగరాల్లో రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కేసులు పెరగటంతో గుజరాత్ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో ఈ రీతిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేసులు బయటపడుతున్న నగరాల్లో గుజరాత్ ప్రభుత్వం వన్ ఈ రోజు నుండి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని డిసైడ్ అయింది. ప్రస్తుతం బయటపడుతున్న కేసులు బట్టి పరిస్థితి రానున్న రోజుల్లో కొనసాగితే ఇండియా మరో ఇటలీ అవడం గ్యారెంటీ అనే టాక్ వినబడుతోంది. ప్రజలలో కనీసం కరోనా పై భయం లేకపోవడం మాత్రమే కాక ఇష్టానుసారంగా మాస్కులు లేకుండా భౌతిక దూరం పాటించకుండా వ్యవహరించడం వల్లే ఈ రీతిలో కేసులు బయట పడుతున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో దేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాయి.