భారత స్వాతంత్ర దినోత్సవం నాడు ఒకేసారి లక్ష మంది తో జూమ్ యాప్ ద్వారా హనుమాన్ చాలీసా లక్ష గళ పారాయణ ఇంటర్నెట్ లో నిర్వహించారు. సిలికానాంధ్ర కి చెందిన శ్రీ కూచిభొట్ల ఆనంద్ గారి సారధ్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 50కి పైగా దేశాల నుండి భారతీయులు వయసుతో నిమిత్తం లేకుండా పాల్గొన్నారు. జూమ్ యాప్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ నుండి ప్రజలను రక్షించాలని ఒకేసారి లక్ష మంది హనుమాన్ చాలీసా పారాయణం చదవటం తో ఈ ఈవెంట్ గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, హనుమాన్ భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ స్వరాలతో హనుమంతుని కీర్తించారు. ఈ కార్యక్రమంలో దేశానికి చెందిన పలువురు రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు మరియు వైద్యులు, న్యాయవాదులు, కళాకారులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మరికొద్ది రోజుల్లోనే ఈ ప్రపంచం నుండి కరోనా వైరస్ వెళ్ళిపోతుందని ఆకాంక్షించారు.
హనుమంతుడికి బుద్ధి, బలం, పరాక్రమం కలగలిసిన శక్తి ఉందని ఖచ్చితంగా ప్రపంచానికి అయినా ఇప్పుడు ఎంతో అవసరమని పేర్కొన్నారు. దైవం మరియు మానవ శక్తి కలగలిసి మహా చైతన్యం గా ఏర్పడి మహమ్మారి కరోనా వైరస్ పై విజయం సాధించడం గ్యారెంటీ అని పలు సంస్థ సభ్యులు అభిలాషించారు. ఇదే టైం లో కొంత మంది ప్రముఖులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సిలికానాంధ్ర భారత సనాతన ధర్మాన్ని రాబోయే తరాలకు అందిస్తుందని, నిజంగా ఇది గొప్ప కార్యక్రమం అంటూ కొనియాడారు.