ఇటీవల కేసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కేసిఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టి తెలంగాణ రాష్ట్ర బాధ్యతలను తనయుడు కేటీఆర్ చేతికి అప్ప చెప్పబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీ నేతలు స్పష్టత ఇవ్వకపోవడంతో ఇక అందరూ దాదాపు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కొత్త పార్టీ పెట్టడం ఖాయమని డిసైడ్ అయిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసిఆర్ జాతీయ పార్టీకి సంబంధించి హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు.
ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..కేసిఆర్ జాతీయ రాజకీయ పార్టీ పెడుతున్నారని ఎక్కడైనా స్పష్టత ఇచ్చారా అని యాంకర్ ని ప్రశ్నించారు. అంతా ఊహాజనితమని… ఒకవేళ అలాంటి సందర్భమే వస్తే మా నాయకుడే వచ్చి చెబుతారని హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా టిఆర్ఎస్ రైతు ప్రభుత్వం అని రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని.., రాష్ట్ర రైతులకు మోసం జరగకూడదని, ఇచ్చే నిధుల విషయంలో కూడా న్యాయం చేయాలని హరీష్ పేర్కొన్నారు.
కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి 10 వేల కోట్లు ఇవ్వాలని ఉద్యోగస్తులకు డబ్బులు ఇవ్వాల్సి ఉందని ఇబ్బంది పెట్టకూడదని కేంద్రం గురించి ఇండైరెక్ట్ గా హరీష్ రావు చెప్పుకొచ్చారు. మొత్తంమీద కేసీఆర్ జాతీయ రాజకీయాలకు సంబంధించి కొత్త పార్టీ పెడుతున్నట్లు వస్తున్న వార్తలలో వాస్తవం లేదు అన్నట్టుగా హరీష్ క్లారిటీ ఇచ్చారు. కేంద్రంతో విభేదాలు అన్నా దాని విషయంలో కొన్ని వాటిలో మాత్రమే వ్యతిరేకించామని… దేశానికి మేలు చేసే విషయాలకు సంబంధించి కేంద్రం అప్పట్లో చేసిన వ్యాఖ్యలని నమ్మి జీఎస్టీకి, పెద్ద నోట్ల రద్దుకి ఓకే చెప్పలేదా అని హరీష్ రావు చెప్పుకొచ్చారు.