TRS: రెండు తెలుగు రాష్ట్రాలలో రాజ్యసభకు అధికార పార్టీ నుండి వెళ్తున్న ప్రముఖుల పేర్లు మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వైసీపీ తరఫున నలుగురు ప్రముఖులు రాజ్యసభ కు వెళుతున్నారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, నిరంజన్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య. జూన్ 21న ఏపీ కోటాలో ఈ నాలుగు స్థానాలు ఖాళీ అవుతుండగా వాటిలో వీరు… చేరనున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టీఆర్ఎస్ తరపున రాజ్యసభకు ఫార్మా దిగ్గజమైన హెటిరో చైర్మన్ బండి పార్థసారథి రెడ్డికి సీఎం కేసీఆర్ అవకాశం ఇవ్వటం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రాజ్యసభకు పార్థసారధి రెడ్డి ని టిఆర్ఎస్ పంపటం పట్ల ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే కరోనా సమయంలో రెమిడీసివర్ మందు… బ్లాక్ మార్కెట్ లో అధిక ధరకు అమ్మినట్లు… ఈయన కంపెనీ పై ఆరోపణలు వచ్చాయి.
అదే సమయంలో ఆదాయపు పన్ను అధికారులు.. హైదరాబాద్ లో పార్థసారధి రెడ్డికి చెందిన పలు అపార్ట్మెంట్ లలో ఉన్న బీరువాలలో తనిఖీలు చేయగా భారీగా నోట్లకట్టలు పట్టుబడ్డాయి. వాటి విలువ దాదాపు 150 కోట్ల రూపాయలు అని అంటున్నారు. ఆ కేసు ఇంకా ఎటూ తేలాలేదు. ఇటువంటి తరుణంలో చైర్మన్ బండి పార్థసారథి రెడ్డి కి.. సీఎం కేసీఆర్ రాజ్యసభ అవకాశం ఇవ్వటం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే సమయంలో వద్దిరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రి రవి… నమస్తే తెలంగాణ ఎండీ దామోదరరావు పేర్లను.. టిఆర్ఎస్ పార్టీ కరారు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఏపీ నుండి రాజ్యసభకు నలుగురు వెళుతుండగా తెలంగాణ నుండి ముగ్గురు టిఆర్ఎస్ పార్టీ తరఫున పెద్దల సభకు వెళ్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?