జగన్ తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు విపక్షాల నుండి కంటే న్యాయ స్థానాల నుండి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వైయస్ జగన్ ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రంలో ఉన్న పేదలకి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని డిసైడ్ అయ్యారు. అధికారంలోకి వచ్చి ఏడాది కాగానే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దాదాపు 30 లక్షల మందికి స్థలాలు ఇవ్వాలని జగన్ తీసుకున్న నిర్ణయం కోర్టు తీర్పులతో వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది.
ఇదిలా ఉండగా రాజధాని ప్రాంతంలో పంపిణీ చేద్దామనుకున్నా భూములను హైకోర్టు అడ్డు పడిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు, విద్యాలయాలకు సంబంధించి ఉన్న భూములను ఇళ్ల పట్టాలు గా పంపిణీ చేయవద్దని హైకోర్టు స్పష్టం చేస్తూ… ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది. దీంతో విశాఖలో అనంతగిరి గిరిజన పాఠశాల స్థలాన్ని ఇళ్ల పట్టాలు ఇవ్వటం పై వేసిన పిటిషన్ పై జరిగిన విచారణ నిమిత్తం హైకోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఈ విషయం నడుస్తూ ఉండగానే మరోపక్క రాష్ట్రంలో విద్యా సంస్థలకు భూములు ఎట్టిపరిస్థితిలో ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని స్పష్టం చేస్తూ ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో కోర్టు ఇచ్చిన తీర్పుతో వైయస్ జగన్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్న సమాచారం. అసలే భూములు ఏపీలో తక్కువ జరుగుతున్న తరుణంలో మరోపక్క కోర్టులు ఇలా అడ్డుపడటంతో సీఎం జగన్ అసహనం చెందుతున్నట్లు సమాచారం. ఇలా అయితే రాష్ట్రంలో పేదలకు ఇళ్లు ఇచ్చే పరిస్థితి ఉండదని జగన్ అంటున్నట్లు టాక్.