Kcr : దేశంలో కరోనా వైరస్ కేసులు ఉన్నా కొద్దీ పెరుగుతూ ఉన్నాయి. పైగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కానీ…పరిస్థితులు చేయి దాటిపోయి రీతిలో ఆయా రాష్ట్రాలలో కేసులు పెరగటంతో పాటు వివిధ రకాలుగా రూపాంతరం చెందుతూ వుండటం తో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల లో అలజడి మొదలైంది. ఇప్పటికే మహారాష్ట్ర అదేవిధంగా చత్తీస్గర్, కర్ణాటక, కేరళ వంటి చోట్ల కేసులు పెరుగుతున్నాయి. దీంతో లాక్ డౌన్ అదే రీతిలో కర్ఫ్యూ లు విధిస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.
పరిస్థితి ఇలా ఉండగా తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు మహారాష్ట్ర అదేవిధంగా కర్ణాటకలో కేసులు పెరగటంతో కేసీఆర్ సర్కార్ కి కీలక ఆదేశాలు ఇస్తూ హైకోర్టు అలర్ట్ చేసింది. పూర్తి విషయంలోకి వెళితే కరోనా హెల్త్ బులిటెన్ ప్రతిరోజు తెలియజేయాలని తెలిపింది. అంత మాత్రమే కాక ప్రజలను గుంపులుగుంపులుగా జరగకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించాలని సూచించింది. గత కొన్ని రోజుల నుండి కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చెయ్యని నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు… కేసీఆర్ సర్కార్ కి మొట్టికాయ ఇచ్చినట్లు అయ్యిందని మీడియా సర్కిల్స్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా కరోనా వైరస్ వచ్చిన ప్రారంభంలో తెలంగాణలో ప్రభుత్వం కూడా చేతులెత్తి పరిస్థితి ఉండటంతో ఈ సారి అలాంటి పరిస్థితులు రాకుండా తెలంగాణ హైకోర్టు ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని అలెర్ట్ చేయాలని డిసైడ్ అయినట్టు తాజా ఆదేశాలు బట్టి తెలుస్తోంది. ఇదిలా ఉంటే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రానికి దగ్గరగా ఉండే తెలంగాణలో ఉన్న జిల్లాలలో ఎక్కడికక్కడ కరోనా పరీక్షలు చేయటానికి తెలంగాణ సర్కార్ రెడీ అవుతున్నట్లు..ఆ రెండు రాష్ట్రాలలో