Breaking News: కరోనా బారిన పడిన రోగులు ప్రస్తుత పరిస్థితుల్లో చాలాచోట్ల లక్షలు ఖర్చుపెట్టి ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న మరణిస్తున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో కృష్ణపట్నం ఆనందయ్య మందు అందుబాటులోకి రావటం .. కరోనా బారిన పడిన రోగుల విషయంలో కొంత ఊరట కలిగిస్తుంది.
మెడిసిన్ పై ఐసీఎంఆర్ మరికొన్ని సంస్థలు అధ్యయనం చేయటం .. ఎటువంటి దుష్ఫలితాలు ఏమి కలగవని తెలపటంతో కంటి మెడిసిన్ కాకుండా మరో మెడిసిన్ కి మొదటి లోనే ప్రభుత్వాల నుండి న్యాయస్థానాల నుండి అనుమతులు రావడం తెలిసిందే. పరిస్థితి ఇలా ఉండగా తాజాగా ఆనందయ్య కంటి మందు విషయంలో కూడా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. మెడిసిన్ పై నివేదిక అందించిన తర్వాత అంతా పరిశీలించి .. ఆనందయ్య కరోనా కంటి మెడిసిన్ వల్ల ఎటువంటి ప్రమాదం లేదని… వాడుకోవచ్చు అంటూ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో తెలుగు రాష్ట్రాలలో .. ఆనందయ్య మెడిసిన్ అందుబాటులోకి రావడంతో .. ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.