అమరావతి, జనవరి 21: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై జరిగిన దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం ఎపి హైకోర్టు నందు విచారణ జరిగింది. వాదనల అనంతరం ఎన్ఐఎ విచారణ నిలిపివేసేందుకు హైకోర్టు అంగీకరించలేదు. ఈ పిటిషన్పై స్టేకు నిరాకరించింది. ఈ నెల 30వ తేదీ లోపు కేంద్రం కౌంటర్ ధాఖలు చేయాలని ఆదేశించింది. ఎన్ఐఎ అధికారులు దర్యాప్తు నివేదికలను హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. న్యాయమూర్తి తదువరి విచారణను జనవరి 30వ తేదీకి వాయిదా వేశారు.
previous post
next post